ఒక్కసారిగా పెరిగిన కేసులు.. 20,03,296కి చేరిన సంఖ్య, నాలుగు జిల్లాల్లో తీవ్రత

Siva Kodati |  
Published : Aug 25, 2021, 06:17 PM ISTUpdated : Aug 25, 2021, 06:18 PM IST
ఒక్కసారిగా పెరిగిన కేసులు.. 20,03,296కి చేరిన సంఖ్య, నాలుగు జిల్లాల్లో తీవ్రత

సారాంశం

ఏపీలో కొత్తగా 1601 కరోనా కేసులు నమోదవ్వగా.. 16 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 1,201 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 14,061 మంది చికిత్స పొందుతున్నారు.  

ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1601మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,03,296కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 16 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,766కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల చిత్తూరులో 6, తూర్పుగోదావరి 2, గుంటూరు 1, కృష్ణ 2, ప్రకాశం 1, నెల్లూరు 2, శ్రీకాకుళం 1, విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 1,201 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 19,75,469కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 71,532 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,62,70,356కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 14,061 మంది చికిత్స పొందుతున్నారు. 

నిన్న ఒక్కరోజు అనంతపురం 26, చిత్తూరు 217, తూర్పుగోదావరి 273, గుంటూరు 123, కడప 108, కృష్ణ 116, కర్నూలు 10, నెల్లూరు 208, ప్రకాశం 124, శ్రీకాకుళం 37, విశాఖపట్నం 98, విజయనగరం 40, పశ్చిమ గోదావరిలలో 221 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

పిల్ల‌లు కాదు పిశాచాలు.. టీచ‌ర్‌పై దాడి చేసి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి. వీడియో చూస్తే ఒళ్లు మండాల్సిందే.
Chintha Vijay Prathap Reddy: జగ్గయ్యపేట అంగన్వాడీ కేంద్రాలపై ఫుడ్ కమిషన్ తనిఖీ| Asianet News Telugu