ఏపీలో పడిపోయిన కరోనా కేసులు, కొత్తగా 1063 మందికి పాజిటివ్, చిత్తూరులో అత్యధికం

Siva Kodati |  
Published : Aug 17, 2021, 05:56 PM IST
ఏపీలో పడిపోయిన కరోనా కేసులు, కొత్తగా 1063 మందికి పాజిటివ్, చిత్తూరులో అత్యధికం

సారాంశం

ఏపీలో కొత్తగా 1063 కరోనా కేసులు నమోదవ్వగా.. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 1,929 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 16,341 మంది చికిత్స పొందుతున్నారు.  

ఆంధ్రప్రదేశ్‌‌‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1063 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19,92,774కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,671కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల చిత్తూరులో నలుగురు, తూర్పుగోదావరి 2, గుంటూరు 2, కృష్ణ 2, అనంతపురంలో ఒక్కరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 1,929 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 19,62,762కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 59,198 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,57,67,609కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 16,341మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 10, చిత్తూరు 211, తూర్పుగోదావరి 53, గుంటూరు 104, కడప 19, కృష్ణ 103, కర్నూలు 17, నెల్లూరు 198, ప్రకాశం 98, శ్రీకాకుళం 30, విశాఖపట్నం 61, విజయనగరం 12, పశ్చిమ గోదావరిలలో 147 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.


 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu