రికార్డ్ ల రారాజుగా అల్లు అర్జున్, పుష్ప2 రిలీజ్ కు ముందే మొదలైన వేట..
రికార్డ్ కా బాప్ ల తయారయ్యాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సోషల్ మీడియాతో పాటు.. సినిమాల ద్వారా కూడా సరికొత్త రికార్డ్స్ ను సెట్ చేస్తున్నాడు.
రికార్డ్ ల రారాజుగా మారిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సోషల్ మీడియా సంచలనంగా తయారయ్యాడు. పుష్పతో పాన్ ఇండియా స్థార్ గా మారిన అల్లు అర్జున్.. ఫాలోయింగ్ లో బడా బడా హీరోలనుపక్కను నెట్టేశాడు. రికార్డ్ ల మీద రికార్డ్ లు కొట్టేస్తున్నాడు.
అల్లు అర్జున్.. ఐకాన్ స్టార్.. స్టైలీష్ ఐకాన్. హ్యాండ్సమ్ స్టార్. ఆయన సినిమా రిలీజ్ అయితే చాలు పోటీపడి చూస్తుంటారు. అయితే ఆ మ్యానియా ఇప్పుడు పాన్ ఇండియాకు అంటుకుంది. పుష్పరాజ్ గా నార్త్ ఆడియన్స్ మనసుల్లో చోటు సంపాదించుకున్న బన్నీ.. అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాలో కూడా రచ్చ చేస్తున్నాడు.
కోట్లు పెట్టి కొత్త ఇల్లు కొన్న పూజా హెగ్డే.. వరుస ఫ్లాప్ లు వెంటాడుతున్న తగ్గేది లేదంటున్న బ్యూటీ..
పుష్ప2 కోసం ఎదరు చూస్తున్న ఆడియన్స్ కోసం తాజాగా అదిరిపోయే టీజర్ అప్ డేట్ ను అందించాడు ఐకాన్ స్టార్. ఈ టీజర్ చూసిన ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. అందకు ముందు రకరకాల రికార్డ్ లు సాధించిన బన్నీ.. ఈ పుష్ప2 టీజర్ తో మరో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
బాలీవుడ్ స్టార్స్ కంటే ఎక్కువ సంపాదిస్తున్న సౌత్ ఇండియన్ హీరోలు ఎవరో తెలుసా.. ?
అల్లు అర్జున్ కు భారీగా ఫాలోయింగ్ పెరుగుతూ వస్తోంది. రొమాంటిక్ ఇమేజ్ ను సాధించిన అల్లు అర్జున్ తాజాగా య్యూట్యూబ్ రికార్డ్ ను సాధించాడు.
పుష్ప2 టీజర్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసి బన్నీ ఖాతాలో అరుదైన రికార్డ్ లను చేర్చింది. ఈ టీజర్ ఏకంగా 138 గంటల పాటు యూట్యూబ్ లో నంబర్ వన్ స్థానంలో కొనసాగింది. పుష్ప2 టీజర్ కు యూట్యూబ్ లో ఏకంగా 110 మిలియన్ల వ్యూస్, 1.55 మిలియన్ల లైక్స్ వచ్చాయి.
138 గంటల పాటు యూట్యూబ్ లో టీజర్ ఫస్ట్ ప్లేస్ లో ఉండటం అంత సాధారణ విషయం కాదు. ఇంతకు ముందు ఇలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేసిన వారు లేదు. పాన్ ఇండియాలో అల్లు అర్జున్ ఫాలోయింగ్ వల్లే ఇది సాధ్యమంది అంటున్నారు ఫ్యాన్స్.
గతంలో కూడా ఇలాంటి రికాడ్స్ ను కొట్టేశాడు బన్నీ. మొన్నటి వరకూ తెలుగు రాష్ట్రాలకే పరిమితం అయిన బన్నీ ఇమేజ్.. ఇప్పుడు పాన్ ఇండియాను కూడా దడదడలాడిస్తోంది. ఇన్స్టాగ్రామ్లో 25 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. దీంతో 25 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న తొలి దక్షిణాది నటుడిగా రికార్డులకెక్కాడు.
సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప-2' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈమూవీతో 1000 కోట్లు దాటాలని చూస్తున్నారు టీమ్. 'పుష్ప: ది రైజ్' కు సీక్వెల్గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీ ఆగస్టు 15వ తేదీన థియేటర్లలోకి రానుంది. 'పుష్ప-2' తర్వాత ఐకాన్ స్టార్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాలతో సినిమాలు చేయనున్నాడని సమాచారం.