Spiritual
శివ భక్తులకు పవిత్రమైన పండుగ మహాశివరాత్రి. ఆ రోజున భక్తులు శివలింగ జలాభిషేకం చేసి, సరైన ఆచారాలు పాటిస్తారు.
గుళ్ళలో, ఇళ్ళలో స్త్రీలు, పురుషులు ఇద్దరూ శివలింగానికి జలాభిషేకం చేయడం ఎక్కువగా చూస్తుంటాం, కానీ నమ్మకాల ప్రకారం దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి.
అవివాహిత అమ్మాయిలు శివలింగంపై నీళ్ళు సమర్పించకూడదని నమ్ముతారు, ఎందుకంటే ఇది ఒక దివ్య శక్తి చిహ్నాన్ని సూచిస్తుంది. ఇలా చేయడం అశుభంగా భావిస్తారు.
అవివాహిత స్త్రీలు శివలింగాన్ని తాకకూడదు, ఎందుకంటే ఇది పార్వతి దేవికి కోపం తెప్పిస్తుంది, భార్య రూపంలో ఉన్న మరో స్త్రీ మహాదేవుడికి దగ్గరవ్వడం ఆమెకు ఇష్టం ఉండదని నమ్మకం.
అవివాహిత స్త్రీ శివలింగాన్ని పదే పదే తాకితే, ఆమె పూజ ఫలం ఉండకపోగా.. వారికి వ్యతిరేకంగా అశుభం కలుగుతుంది. పార్వతి దేవి కోపగించి చెడు ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు.
అవివాహిత స్త్రీలు మాత్రమే శివలింగాన్ని తాకకూడదని కాదు. వివాహిత స్త్రీలు కూడా శివలింగాన్ని తాకకూడదు. వారు విగ్రహ రూపంలో శివపార్వతులను పూజించవచ్చు.
మత విశ్వాసాల ప్రకారం, పార్వతి దేవికి మాత్రమే శివలింగాన్ని తాకే హక్కు ఉంది. ఆమె తన దేవుడిని తాకి శివలింగ రూపంలో పూజించవచ్చు.
శివలింగాన్ని పూజించే నియమం ప్రత్యేకంగా స్త్రీలకు మాత్రమే. పార్వతి దేవి అనుగ్రహం కూడా పొందాలంటే స్త్రీలు శివలింగాన్ని తాకకుండా ఉండాలి. పురుషులు తాకవచ్చు.
మహా శివరాత్రి నాడు శివయ్య పూజతో ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. మహాశివరాత్రి రోజున శివపార్వతులు, గణేశుడు, కార్తికేయుడిని కలిపి పూజించాలని పురాణాలు చెబుతున్నాయి.