ఒక గిన్నెలో రాగి పిండిని తీసుకుని అరకప్పు నీళ్లు పోసి కలపాలి. ఎక్కడ చిన్నపాటి ఉండలు కూడా లేకుండా కలుపుకోవాలి. దీనికోసం నీటితో రాగి పిండిని పావుగంట సేపు నీటిలో నానబెడితే మంచిది.
Image credits: Instagram
Telugu
నీళ్లు మరిగించి
ఒక గిన్నెలో నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టి మరిగించాలి. ఆ నీళ్లు మరిగాక ముందుగా నానబెట్టుకున్న రాగి మిశ్రమాన్ని ఓసారి కలుపుకుని మరుగుతున్న నీటిలో వేసి కలుపుతూ ఉండాలి.
Image credits: Instagram
Telugu
అయిదు నిమిషాల్లో రెడీ
స్టవ్ మీద మిశ్రమాన్ని చిన్న మంట మీద సుమారు 5 నిమిషాల పాటు ఉడికించాలి. గరిటెతో కలుపుతునే ఉండాలి. ఇది చిక్కబడ్డాక స్టవ్ ఆపేయాలి.
Image credits: Instagram
Telugu
టేస్ట్ కోసం
స్టవ్ ఆపేసి రాగి మిశ్రమం కాస్త చల్లారాక మజ్జిగ, జీలకర్ర పొడి, ఉప్పు, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. పైన కొద్దిగా తాజా కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి.
Image credits: Instagram
Telugu
చిట్కా
ఇలా రాగి అంబలి రోజూ చేసుకుని తాగితే ఎంతో రుచిగా ఉంటుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఇలా తాగితే ఎంతో ఆరోగ్యం.