Telugu

నిర్జలీకరణం

శరీరంలో వాటర్ కంటెంట్ తక్కువగా ఉండటాన్నే నిర్జలీకరణం అంటారు. మీకు తెలుసా డీహైడ్రేషన్ కూడా మన ప్రాణాలను తీసేయగలదు. అయితే ఉదయాన్నే పండ్లు తినడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. 

Telugu

ఇమ్యూనిటీ

విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పండ్లను ఉదయం ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే ఈ పండ్లు మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 

Image credits: Getty
Telugu

టాక్సిన్స్ తొలగిపోతాయి

పండ్లను ఉదయాన్నే తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. దీంతో  కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం పొందుతారు. 
 

Image credits: Getty
Telugu

జీర్ణం

ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండే పండ్లను తినడం వల్ల ఉదయం మలబద్దకాన్ని నివారించొచ్చు. అలాగే మీ జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా ఇది సహాయపడుతుంది.
 

Image credits: Getty
Telugu

గుండె ఆరోగ్యం

విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే పండ్లు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను, రక్తపోటును తగ్గిస్తాయి. అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
 

Image credits: Getty
Telugu

ఒత్తిడి తగ్గుతుంది

పండ్లు ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడతాయి. ఒత్తిడి మానసిక ఆరోగ్యాన్నే కాదు శరీర ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఉదయాన్నే పండ్లు తింటే మీ మానసిక ఆరోగ్యం బాగుంటుంది. 
 

Image credits: Getty
Telugu

బరువు తగ్గడానికి

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండ్లను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గుతారు. ఎందుకంటే ఈ ఫైబర్ మీ కడుపును తొందరగా నింపుతుంది. అతిగా తినకుండా చేస్తుంది.
 

Image credits: Getty
Telugu

చర్మ ఆరోగ్యం

పండ్లలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పండ్లను తింటే మీ చర్మం తేమగా, కాంతివంతంగా ఉంటుంది. 
 

Image credits: Getty

బ్లడ్ షుగర్ పెరిగిందని ఈ అవయవాలను బట్టి కూడా తెలుసుకోవచ్చు

నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు

బోర్ కొట్టినప్పుడు తినాల్సిన ఆహారాలు ఇవి

ఈ కూరగాయలు మీ బరువును తగ్గిస్తయ్