రోజుకు ఒకసారైనా పెరుగును ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. పెరుగులో విటమిన్ బి2, విటమిన్ బి12, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.
life Sep 14 2023
Author: Mahesh Rajamoni Image Credits:Getty
Telugu
శరీరానికి మేలు
పెరుగులో పుష్కలంగా ట్రిప్టోపాన్ అనే అమైనో ఆమ్లం కూడా ఉంటుంది. ఇది మన మనసును, శరీరాన్ని మరింత ఉల్లాసంగా మారుతుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది.
Image credits: Getty
Telugu
ఎముకల ఆరోగ్యం
పెరుగులో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఈ కాల్షియం మన ఎముకలను, దంతాలను బలంగా, ఆరోగ్యంగా చేస్తుంది. పెరుగు ఎలాంటి ఆహారాన్నైనా సులువుగా జీర్ణం చేస్తుంది.
Image credits: google
Telugu
అల్సర్లు
పెరుగును రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అల్సర్లు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ప్రతిరోజూ ఒకసారైనా పెరుగును తినండి.
Image credits: google
Telugu
ఇమ్యూనిటీ
పెరుగును తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే గుండె జబ్బుల ముప్పు కూడా తప్పుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Image credits: google
Telugu
అధిక రక్తపోటు
శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, అధిక రక్తపోటును తగ్గించడానికి పెరుగు సహాయపడుతుంది. పెరుగును తింటే అధిక రక్తపోటు సమస్య వచ్చే అవకాశం తగ్గుతుంది.
Image credits: google
Telugu
కాల్షియం
పెరుగును రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన కాల్షియం అందుతుంది. ఇది మన ఎముకలు, దంతాలను బలోపేతం చేస్తుంది.