పచ్చిమిర్చి మొక్కలు నాటేందుకు నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలి. అప్పుడే మొక్కలు బాగా పెరుగుతాయి.
నీరు నిలిచిపోయే గట్టి మట్టిలో మొక్కలు నాటొద్దు. నీరు సులువుగా ఇంకిపోయేలా గుల్లగా ఉండే మట్టిని ఎంచుకోవాలి. అప్పుడే వేర్లు బాగా పెరుగుతాయి.
మొక్క పెరిగేందుకు తగినంత స్థలం ఉండాలి. కనీసం 12 అంగుళాల సైజు ఉన్న కుండీ లేదా గ్రోబ్యాగ్ ఎంచుకోవాలి.
రోజూ మొక్కలకు ఎక్కువ నీళ్లు పోయొద్దు. అలా చేస్తే వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంది. మట్టి తడి ఆరిన తర్వాతే మళ్లీ నీళ్లు పోయడం మంచిది.
పచ్చిమిర్చి మొక్కలకు సూర్యరశ్మి అవసరం. కాబట్టి ఎండ సరిగ్గా తగిలే చోట పెడితే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి.
మొక్కలు చక్కగా పెరగాలంటే సమయానుసారం సేంద్రియ ఎరువులు వేయాలి. అప్పుడే మొక్కకు పోషకాలు బాగా అందుతాయి.
ఆకులు ముడుచుకుపోవడం, పురుగులు పట్టడం లాంటివి గమనిస్తే వెంటనే వేప నూనె మిశ్రమాన్ని పిచికారీ చేయాలి.
Double Layered Chains: బడ్జెట్ లో గ్రాండ్ లుక్ ఇచ్చే టూ లేయర్ నక్లెస్
Papaya: రోజూ బొప్పాయి తింటే ఊహించని ప్రయోజనాలు
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Black Beads: డైలీవేర్ నుంచి పార్టీవేర్ వరకు ఈతరం మెచ్చే మంగళసూత్రాలు