మనీ ప్లాంట్ను వేగంగా పెంచాలనుకుంటే, దానికి తప్పకుండా సూర్యరశ్మి తగలాలి. అలా తగిలేలా ఉంచితే మనీప్లాంట్ త్వరగా పెరుగుతుంది.
ఉల్లిపాయ తొక్కలు నానబెట్టిన నీటిలో సిలికా, సల్ఫర్ ఉంటుంది. ఈ నీరు వేస్తే కొత్త ఆకులు వస్తాయి. ప్రతి 10 రోజులకు ఒకసారి ఈ నీరు వేస్తే మంచిది.
పెసరపప్పు నానబెట్టిన నీరు వేయడం వల్ల మనీ ప్లాంట్ కు ప్రోటీన్, నైట్రోజన్ అందుతుంది. మొక్క తీగ పొడవుగా పెరుగుతుంది.
కలబంద జెల్ కలిపిన నీరు మనీ ప్లాంట్కు పోస్తే ఎంతో మంచిది. ఇది వేర్లకు బలాన్ని ఇస్తుంది. నెలకు రెండుసార్లు ఇలా నీరు వేస్తే మంచిది.
వేప ఆకులు నానబెట్టిన నీటిని మనీ ప్లాంట్కు వేస్తే ఎంతో మంచిది. ఫంగస్, కీటకాల నుండి ఇది కాపాడుతుంది. మొక్కకు అనారోగ్యం రానివ్వదు.
బియ్యం కడిగిన నీరు కూడా ఎంతో మంచిది. ఇది మట్టికి సూక్ష్మజీవులను అందించి, ఆకులు పచ్చగా వేగంగా పెరిగేలా చేస్తుంది.
ఇంట్లో మనీ ప్లాంట్ పెంచితే ఎంతో మంచిదని చెబుతారు. ఆర్ధిక సమస్యలు కూడా తొలగిపోతాయని చెబుతారు.
బీట్రూట్ రసంలో వీటిని కలిపి రాస్తే.. ముఖం చిటికెలో మెరిసిపోతుంది!
పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ డి ఆహారాలు
లేటెస్ట్ డిజైన్ వెండి పట్టీలు.. వెయిట్ కూడా చాలా తక్కువ!
వెల్లుల్లి రోజూ తింటే ఏమౌతుంది?