కలబంద గుజ్జును మెత్తగా చేసి అందులో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఇది ముఖానికి మెరుపునిస్తుంది.
కలబంద గుజ్జులో కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి ముఖానికి రాసుకుని 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. నల్లమచ్చలు, మొటిమల సమస్య తగ్గుతుంది.
కలబంద గుజ్జును తీసుకుని దానికి కొద్దిగా తేనెను జోడించి ముఖానికి అప్లై చేసుకోవాలి. దీనివల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.
కలబంద గుజ్జులో కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలిపి ముఖానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
కలబంద గుజ్జులో బాగా పండిన అరటిపండును మెత్తగా గుజ్జులా చేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. సహజమైన మెరుపు మీ సొంతం అవుతుంది.
కలబంద గుజ్జు, కీరదోస రసాన్ని బాగా కలిపి ఆ తర్వాత దాన్ని వడకట్టి, దూదితో ముఖానికి రాసుకోవాలి. దీనివల్ల ముఖం మృదువుగా మారుతుంది.
Water Bottle Lines: వాటర్ బాటిల్ పై వంకర గీతలు ఎందుకుంటాయి?
Beads Necklace:ముత్యాలు,పూసలతో అదిరిపోయే నక్లెస్ డిజైన్లతో రాయల్ లుక్
Blouse Back Designs:ఏ చీరకు అయినా పర్ఫెక్ట్ గా సూటయ్యే బ్లౌజు డిజైన్లు
Gold Saree: పండగ వేళ బంగారంలా మెరిసిపోయే గోల్డెన్ శారీ డిజైన్లు..