కలుషితమైన తాగునీరు, ఆహారం ద్వారా టైఫాయిడ్, వాంతులు, విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి.
వర్షాకాలంలో నీటిని వేడి చేసి.. చల్లార్చుకొని తాగడం మంచిది. నీటిని మరిగించిన కొన్ని సెకన్లలోనే సూక్ష్మక్రిములు నశిస్తాయి.
కామెర్లకు కారణమయ్యే వైరస్లు నశించాలంటే నీటిని కనీసం ఐదు నిమిషాలు బాగా మరిగించాలి.
ఇంట్లో వండిన ఆహారాన్ని తినడం మంచిది. కాస్త వేడి వేడిగా తింటే రుచి, ఆరోగ్యం రెండూ బాగుంటాయి.