సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి శక్తినిస్తుంది. అంతేకాకుండా ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. కొవ్వులు అస్సలు ఉండవు.
సగ్గుబియ్యాన్ని ఉడికించి లేదా వేయించి అల్పాహారంగా తీసుకోవచ్చు. ఇది రోజంతా శరీరాన్ని ఉత్తేజంగా ఉంచుతుంది. ఎక్కువగా తినాలనే కోరికను తగ్గిస్తుంది.
జగ్గు బియ్యం జీర్ణం కావడానికి సమయం పడుతుంది కాబట్టి మీ కడుపు ఎక్కువసేపు నిండి ఉంటుంది. ఇది తరచుగా తినడాన్ని నిరోధించి బరువును నియంత్రిస్తుంది.
వ్యాయామానికి ముందు సగ్గుబియ్యం తింటే శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లను అందిస్తుంది. వ్యాయామం తర్వాత పెరుగు (లేదా) పండ్లతో కలిపి తింటే కండరాల కోలుకోవడానికి సహాయపడుతుంది.
సగ్గుబియ్యంతో కిచిడి (లేదా) ఉప్మా తయారుచేసేటప్పుడు తక్కువ నూనె, ఎక్కువ ఆకుకూరలు వాడి వండుకోవాలి. ఇది తినడానికి రుచిగా ఉంటుంది, కేలరీలను తగ్గిస్తుంది.
రాత్రి సగ్గుబియ్యం తింటే జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అందువల్ల రాత్రిపూట దాన్ని తినకూడదు. ఉదయం లేదా మధ్యాహ్నం తింటే అది తేలికగా జీర్ణమవుతుంది.
బరువు తగ్గడానికి సగ్గుబియ్యాన్ని రోజుకు ఒక గిన్నె తింటే సరిపోతుంది. ఎక్కువగా తింటే ప్రతికూల ప్రభావం చూపుతుంది.