నానబెట్టిన కిస్ మిస్ లను తింటే మీ శరీరంలో ఈ తేడాను గమనిస్తారు
health-life Jan 28 2025
Author: Shivaleela Rajamoni Image Credits:Getty
Telugu
కిస్ మిస్
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ప్రతిరోజూ పరిగడుపున నానబెట్టిన కిస్ మిస్ లను తిని దాని వాటర్ తాగాలి. ఇది మీ ఆరోగ్యాన్ని ఎన్నో విధాలుగా మెరుగుపరుస్తుంది.
Image credits: Getty
Telugu
జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది
నానబెట్టిన కిస్ మిస్ లల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రేగులను శుభ్రపరుస్తుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది.
Image credits: Getty
Telugu
రక్తహీనత తగ్గుతుంది
ఎండుద్రాక్షలో విటమిన్ బి12, ఇనుము మెండుగా ఉంటాయి. ఇవి రక్తహీనత సమస్యను తగ్గిస్తాయి. అంటే నానబెట్టిన కిస్ మిస్ లను తింటే మీ ఒంట్లో రక్తం పెరుగుతుంది.
Image credits: Getty
Telugu
ఎముకలు బలంగా అవుతాయి
కిస్ మిస్ లల్లో బొరాన్, కాల్షియం లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచుతాయి. ఎముకల పగుళ్లను నివారిస్తుంది. వృద్ధులకు ఈ కిస్ మిస్ లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.
Image credits: Getty
Telugu
గుండె ఆరోగ్యంగా ఉంటుంది
ఎండుద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం లు పుష్కలంగా ఉంటాయి. ఇవి హైబీపీని కంట్రోల్ చేస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీంతో గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.
Image credits: Getty
Telugu
చర్మం ఆరోగ్యంగా ఉంటుంది
కిస్ మిస్ లో విటమిన్ సి, విటమిన్ ఇ , యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ముడతలను తగ్గించి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. ఇవి స్కిన్ గ్లోను పెంచుతాయి. .
Image credits: Getty
Telugu
15 రోజుల్లో ప్రభావం చూడండి
రెగ్యులర్ గా ఉదయం పరిగడుపున నానబెట్టిన కిస్ మిస్ లను తింటే మీరు ఆరోగ్యంగా ఉండటమే కాదు అందంగా కూడా ఉంటారు. దీని ప్రభావం 15 రోజుల్లోనే తెలుస్తుంది.