లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. వీటిని భోజనం చేసిన తర్వాత నమిలితే మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే దగ్గు, జలుబు వంటి సమస్యలు రావు.
లవంగాలు డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. షుగర్ ఉన్నవారు వీటిని ఉదయాన్నే నమిలితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
లవంగాల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని తిన్న వెంటనే నమిలితే గ్యాస్ సమస్య, కడుపు ఉబ్బరం వెంటనే తగ్గిపోతాయి.
చాలా మందికి తిన్న వెంటనే ఎసిడిటీ అటాక్ చేస్తుంది. ఇలాంటి వారు భోజనం చేసిన తర్వాత లవంగాలను నమిలితే ఎసిడిటీ తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. లవంగాలు మన నోటి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని నమిలితే పంటి నొప్పి తొందరగా తగ్గిపోతుంది.
నోటి దుర్వాసనను తగ్గించడానికి లవంగాలు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం లవంగం నూనెను గోరువెచ్చని నీళ్లలో కలిపి తిన్న తర్వాత పుక్కిలించాలి.
ఏదేమైనా ఆరోగ్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే మీ ఆహారంలో మార్పులు చేయాలి.