Beauty Tips: శనగపిండి vs పసుపు.. ముఖానికి ఏది మంచిది ?
health-life Jun 12 2025
Author: Rajesh K Image Credits:pinterest
Telugu
శనగపిండి ప్రయోజనాలు
శనగ పిండి సహజమైన క్లెన్సర్గా పనిచేస్తుంది. చర్మం నుండి మొండిగా ఉన్న మురికిని తొలగిస్తుంది. ఇందులో ఎక్స్ఫోలియేటింగ్ లక్షణాలుండటం వల్ల చర్మం పైన ఉన్న మృతకణాల పొరను తొలగిస్తుంది.
Image credits: Freepik
Telugu
ఇలా వాడితే..
శనగపిండిని క్రమం తప్పకుండా వాడటం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. జిడ్డును తగ్గిస్తుంది. ఇది చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడంలో, మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.
Image credits: pinterest
Telugu
పసుపు ప్రయోజనాలు
పసుపులో ఉండే అలెర్జీ నిరోధక లక్షణాలు మచ్చలు, మొటిమలను నయం చేయడంలో సహాయపడతాయి. పసుపు, తేనె కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది, మచ్చలు తగ్గుతాయి.
Image credits: freepik
Telugu
వృద్ధాప్యానికి చెక్
పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతం చేయడంలో సహాయపడతాయి, అలాగే వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయి. పసుపు చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
Image credits: social media
Telugu
ఏది బెస్ట్?
మీకు జిడ్డు చర్మం ఉంటే లేదా డీప్ క్లెన్సింగ్ అవసరమైతే శనగపిండి మంచి పరిష్కారం. శనగ పిండి చాలా మంచి క్లెన్సర్ అయినందున చర్మం నుంచి జిడ్డును నియంత్రిస్తుంది.
Image credits: pinterest
Telugu
పసుపును ఇలా వాడితే..
మొటిమలు, మచ్చలు, నల్లటి మచ్చలు, వాపు వంటి చర్మ సమస్యలను తగ్గించడానికి పసుపు ఉపయోగించవచ్చు. పసుపులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీలు మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి,
Image credits: Social Media
Telugu
మొటిమలు, ముడతలకు చెక్
పెరుగు, శనగపిండి, పసుపు మూడు కలిసి ప్యాక్లా చేసుకుని ముఖానికి, చర్మానికి పట్టించడం వల్ల సౌందర్యం పెరుగుతుంది. చర్మంపై చేరే బ్యాక్టీరియాను నాశనం చేసి, చర్మం ఆరోగ్యవంతంగా మారుతుంది.