మామిడి పండ్లు తీయగా, టేస్టీగా ఉంటాయి. అయితే ఒక మీడియం సైజు మామిడి పండులో 46 గ్రాముల షుగర్ ఉంటుంది. ఈ పండ్లను తింటే షుగర్ బాగా పెరుగుతుంది. అందుకే మధుమేహులు ఈ పండ్లను తినకూడదు
దానిమ్మ పండులో కూడా నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటుంది. ఒక దానిమ్మ పండులో 24 గ్రాముల షుగర్ ఉంటుంది కాబట్టి దీన్ని తక్కువగా తినాలంటారు డాక్టర్లు.
ద్రాక్షపండ్లు ఆరోగ్యానికి మంచివే అయినా డయాబెటీస్ పేషెంట్లు మాత్రం దీన్ని ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే కప్పు ద్రాక్షల్లో 23 గ్రాముల షుగర్ ఉంటుంది. ఈ పండ్లు బ్లడ్ షుగర్ ను పెంచుతాయి.
కప్పు చెర్రీ పండ్లలో 18 గ్రాముల నేచురల్ షుగర్ ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా తింటే కూడా రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి.
అరటిపండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఒక మీడియం సైజు అరటిలో 14 గ్రాముల షుగర్ ఉంటుంది. బాగా పండిన అరటిపండులో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే షుగర్ పెరుగుతుంది.
పైనాపిల్ లో కూడా షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. కప్పు పైనాపిల్లో 16 గ్రాముల షుగర్ ఉంటుంది. ఈ పండ్లు కూడా మీ బ్లడ్ షుగర్ ను పెంచుతాయి.
పుచ్చకాయ మంచిదే అయినా దీనిలో నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే కూడా డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.