వర్షాకాలంలో ఖాళీ కడుపుతో ఫైనపిల్ తినకూడదు. ఎందుకంటే, ఇది కడుపులో ఆమ్లత (అసిడిటీ)ను పెంచుతుంది. దాంతో పాటు, కడుపులో మంట, నొప్పి వంటి అసౌకర్యాలు కలుగుతాయి."
వర్షాకాలంలో ఖాళీ కడుపుతో మామిడి పండ్లు తినడం వల్ల గ్లూకోజ్ లెవల్స్ హఠాత్తుగా పెరిగి, బరువు పెరగడానికి కారణమవుతుంది. అందుకే తినేముందు తేలికపాటి ఆహారం తీసుకోవాలి.
ఖాళీ కడుపుతో ఆరెంజ్ తినకూడదు. ఈ పండులోని సిట్రిక్ యాసిడ్ ప్రభావంతో కడుపు మంట, ఆమ్లత, వాపు కలగవచ్చు. వర్షాకాలంలో ఇది మరింత ప్రభావితం చేస్తుంది.
ద్రాక్షలో ఫ్రక్టోజ్ అనే సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది. అలాంటి వర్షాకాలంలో ద్రాక్షను ఖాళీ కడుపుతో తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరిగే అవకాశం ఉంటుంది.
వర్షాకాలంలో ఖాళీ కడుపుతో అరటి పండు తినడం వల్ల కడుపులో గ్యాస్, ఆమ్లత, కడుపు వాపు వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల తినేముందు తేలికపాటి ఆహారం తీసుకోవడం ఉత్తమం.
వర్షాకాలంలో ఖాళీ కడుపుతో సపోటా తింటే, దానిలోని అధిక చక్కెర రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది. అందువల్ల ముందు కొద్దిగా ఆహారం తీసుకుని తినడం మంచిది
బేరి, ఆపిల్ వంటి పండ్లను వర్షాకాలంలో ఖాళీ కడుపుతో తినవచ్చు. అయితే డయాబెటిస్ ఉన్నవారు వైద్యుడి సలహా లేకుండా తినకూడదు.