నాన్ వెజ్ తినడం ఆరోగ్యానికి మంచిదే. కానీ ప్రతిరోజూ తినడం వల్ల సమస్యలు పెరుగుతాయి.
రోజూ మాంసాహారం తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మాంసాహారంలో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రోజూ తింటే కొలెస్ట్రాల్, రక్తపోటు సమస్య పెరిగే అవకాశం ఉంది.
మాంసాహారం జీర్ణం కావడం కష్టం. ఇది గ్యాస్, మలబద్ధకం, అజీర్తికి దారితీస్తుంది.
రెడ్ మీట్ ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి తగ్గిస్తే మంచిది.
ప్రతిరోజూ నాన్ వెజ్ తినడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దాని వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి.
మాంసాహారంలో అవసరానికి మించి ప్రోటీన్ ఉంటుంది. ఎక్కువ ప్రోటీన్ తినడం వల్ల కిడ్నీలపై చెడు ప్రభావం పడుతుంది.
అధికంగా మాంసాహారం తినడం వల్ల కాలేయంపై ఒత్తిడి పెరిగి అనేక సమస్యలకు దారితీస్తుంది.