Telugu

ఇంట్లో చేసిన ఈ డ్రింక్ తాగితే బాగా జీర్ణమవుతుంది.. ఉబ్బరం తగ్గుతుంది

Telugu

లెమన్ వాటర్ తేనె

గోరువెచ్చని నీళ్లలో సగం నిమ్మరసం, తేనెను వేసి కలుపుకుని తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే మలబద్దకం తగ్గుతుంది. మీ కాలెయ పనితీరు మెరుగుపడుతుంది. 

Image credits: Freepik
Telugu

దోసకాయ నీళ్లు

దోసకాయను చిన్న చిన్న ముక్కలుగా కోసి మగ్గు వాటర్ లో వేయండి. దీనిలోనే ఫ్రెష్ పుదీనా ఆకులను వేసి గంటపాటు పక్కన పెట్టి తర్వాత తాగండి. ఈ వాటర్ ను తాగితే మీ బాడీ హైడ్రేట్ గా ఉంటుంది.

Image credits: Freepik
Telugu

ఆపిల్ సైడర్ వెనిగర్

గ్లాస్ గోరువెచ్చని నీళ్లలో టీ స్సైన్ ఫిల్టర్ చేయని ఆపిల్ సైడర్ వెనిగర్, తేనెను వేసి కలపండి. దీన్ని భోజనానికి 15 నుంచి 20 నిమిషాల ముందు తాగాతే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

Image credits: Freepik
Telugu

అల్ల నిమ్మకాయ నీళ్లు

కొన్ని నీళ్లలో అల్లం ముక్కలను వేసి 10 నిమిషాలు ఉడికించండి. దీనిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగండి. ఇది పేగుల్లో మంటను తగ్గిస్తుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. 

Image credits: Freepik
Telugu

కలబంద జ్యూస్

ఇందుకోసం గ్లాస్ నీళ్లలో ఫ్రెష్ కలబంద జెల్ ను కొంచెం నిమ్మరసం వేసి కలపండి. అలొవేరా జెల్ సహజ భేదిమందుగా పనిచేస్తుంది. దీన్ని తాగితే మంట తగ్గుతుంది. 

Image credits: Freepik
Telugu

సోంపు నీళ్లు

గ్లాస్ వాటర్ లో టీ స్పూన్ సోంపును వేసి రాత్రంతా నానబెట్టండి. దీన్ని వడకట్టి ఉదయాన్నే తాగండి. ఇది కడుపు ఉబ్బరం, వాయువు, తిమ్మిరిని తగ్గిస్తుంది. ఇది పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది.

Image credits: Freepik
Telugu

పసుపు వాటర్

గ్లాస్ గోరువెచ్చని నీళ్లలో అర టీస్పూన్ పసుపును వేసి బాగా కలపండి. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలుంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. 

Image credits: Freepik

లెమన్ జ్యూస్ ను ఎప్పుడు తాగాలి?

Diabetes: షుగర్ ఉన్నవారు ఉదయం ఏం తినాలి?

Green Tea: రోజూ మార్నింగ్ గ్రీన్ టీ తాగితే ఏమౌతుందో తెలుసా?

దగ్గు, జలుబు ఉన్నప్పుడు ఏం తినకూడదు?