Money Plant: ఎండాకాలంలో కూడా మనీ ప్లాంట్ బాగా పెరగాలా? ఇలా చేస్తే చాలు
gardening May 23 2026
Author: ramya Sridhar Image Credits:Getty
Telugu
పసుపు..
మనీ ప్లాంట్ కుండీలోని మట్టిలో కొద్దిగా పసుపు కలపాలి. ఇలా చేయడం వల్ల మనీ ప్లాంట్ చాలా వేగంగా, గుబురుగా పెరుగుతుంది. పురుగు కూడా పట్టదు.
Image credits: Getty
Telugu
టీ పొడితో ఎరువు
వాడిన టీ పొడిని బాగా కడిగి (చక్కెర పోయేలా) మొక్క మొదట్లో వేయండి. ఇది మొక్కకు అద్భుతమైన ఆర్గానిక్ ఎరువులా పనిచేస్తుంది. ఒక మీడియం సైజు కుండీకి 2-3 చెంచాల వాడిన టీ పొడి సరిపోతుంది.
Image credits: Social Media
Telugu
ఎప్సమ్ సాల్ట్
ఆకులు ముదురు పచ్చగా, దట్టంగా పెరగడానికి మట్టిలో కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ కలపండి. కేవలం అర టీస్పూన్ నుంచి ఒక టీస్పూన్ ఎప్సమ్ సాల్ట్ వేస్తే సరిపోతుంది.
Image credits: Getty
Telugu
ఎండ తగలనివ్వొద్దు
మొక్కను నేరుగా ఎండ తగిలే చోట పెట్టొద్దు. దీనికి రోజుకు కేవలం 1 గంట మితమైన ఎండ తగిలితే చాలు.
Image credits: gemini
Telugu
నీళ్లు ఎప్పుడు పోయాలి?
కుండీలోని పైమట్టి ఒక అంగుళం వరకు ఆరినప్పుడు మాత్రమే నీళ్లు పోయండి. ఎక్కువగా నీళ్లు పోస్తే వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంది.
Image credits: Getty
Telugu
ఆకుల శుభ్రత
వారానికి ఒకటి రెండుసార్లు స్ప్రే బాటిల్తో ఆకులపై నీళ్లు చల్లండి. ఇలా 'షవర్' చేయిస్తే మనీ ప్లాంట్ ఆకులు మెరుస్తూ తాజాగా కనిపిస్తాయి.
Image credits: Getty
Telugu
ట్రిమ్ చేయడం మర్చిపోవద్దు
పసుపు రంగులోకి మారిన, ఎండిపోయిన ఆకులను కత్తిరించి తీసేయండి. మొక్కను ట్రిమ్ చేయడం వల్ల కొత్త చిగుళ్లు వేగంగా వస్తాయి. ఆకులపై దుమ్ము లేకుండా శుభ్రంగా ఉంచాలి.