వేయించిన శెనగలు, బెల్లం రెండింటి కలిపి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.
మీరు సీజనల్ వ్యాధుల బారిన పడుతుంటే మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటమే కారణం. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఉదయం బెల్లం, వేయించిన శనగలు తింటే చాలు.
మీ ఎముకలు బలహీనంగా ఉంటే, వాటిని దృఢంగా చేసుకోవడానికి ప్రతిరోజూ ఉదయం బెల్లం, శనగలు తినండి.
బెల్లం, శనగలు మీ జ్ఞాపకశక్తిని, మెదడు చురుకుదనాన్ని పెంచుతాయి. పెద్దలు, పిల్లలు ఉదయం వీటిని తినాలి.
మీ బరువు పెరుగుతుంటే, మీ ఆహారంలో వేయించిన శనగలు, బెల్లం చేర్చుకోండి. వీటిని కలిపి తినడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది.
బెల్లం, శనగలు తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. వాటిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.