దోసకాయ, పెరుగు రెండూ చల్లని గుణాలు కలిగినవి. ఈ రెండూ కలిపి తింటే.. జలుబు, దగ్గు వస్తుంది. జీర్ణక్రియను నెమ్మదిస్తుంది.
దోసకాయలో క్షార గుణం, టమాటాలో ఆమ్ల గుణం ఉంటుంది. ఈ రెండూ కలిస్తే ఆమ్ల-క్షార ప్రతిచర్య జరుగుతుంది. దీనివల్ల గ్యాస్, అజీర్తి, ఎసిడిటీ సమస్య వస్తుంది.
దోసకాయ తింటే ఎక్కువ ఉప్పు, మసాలాలు వేసుకోవద్దు. ఇవి దోసకాయలోని ఆరోగ్యకరమైన అంశాలను తగ్గిస్తాయి, శరీరంలో నీటి కొరతను ఏర్పడుతుంది.
దోసకాయలో నీళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, తిన్న వెంటనే నీళ్ళు తాగితే జీర్ణ సమస్యలు వస్తాయి. గ్యాస్, మలబద్ధకం పెరుగుతాయి.
దోసకాయని పగటిపూట, ముఖ్యంగా మధ్యాహ్న భోజనం తర్వాత తినడం మంచిది.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో దోసకాయ తింటే మలబద్ధకం తగ్గుతుంది, శరీరానికి నీళ్ళు అందుతాయి.
దోసకాయని కొన్న వెంటనే శుభ్రమైన నీటితో బాగా కడగాలి. దానిపై రసాయనాలు, మైనం ఉండొచ్చు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.