కీరదోసకాయ, పెరుగు రెండూ చల్లని గుణాలు కలిగి ఉంటాయి. ఈ రెండూ కలిపి తీసుకుంటే దగ్గు, శ్లేష్మం వంటి సమస్యలు వస్తాయి. జీర్ణక్రియను కూడా నెమ్మదిస్తుంది.
కీరదోసకాయలో క్లార గుణం, టమాటలో ఆమ్ల గుణం ఉంటుంది. ఈ రెండూ కలిస్తే ఆమ్ల-క్షార ప్రతిచర్య ఏర్పడుతుంది. దీని వల్ల అజీర్తి, గుండెల్ల మంట వచ్చే అవకాశం ఉంది.
కీరదోసకాయ తినేటప్పుడు ఎక్కువ ఉప్పు , మసాలా దినుసులు వేసుకోవద్దు. ఎందుకంటే ఇవి కీరదోస ఆరోగ్యకరమైన అంశాలను బలహీనపరుస్తాయి, శరీరంలో నీటి కొరతను కలిగిస్తాయి.
కీరదోసకాయలో నీరు ఎక్కువగా ఉండటం వల్ల, దానిని తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణ సమస్యను కలిగిస్తుంది. మలబద్ధకం సమస్య పెరుగుతుంది.
కీరదోసకాయను పగటిపూట, ముఖ్యంగా మధ్యాహ్న భోజనం తర్వాత తినడం మంచిది.
ఉదయం ఖాళీ కడుపుతో కీరదోసకాయ తింటే మలబద్ధకం సమస్య తగ్గుతుంది. శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది.
కీరదోసకాయను కొన్న వెంటనే శుభ్రమైన నీటితో బాగా కడగాలి. ఎందుకంటే దానిపై రసాయనాలు, మైనం వంటివి పేరుకుని ఉండవచ్చు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.