టీ తాగిన తర్వాత పండ్లు తినకూడదు. టీలో ఉండే టానిన్లు పండ్లలోని పోషకాలను శరీరం గ్రహించకుండా ఆపుతాయి. ఇది గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలకు దారితీస్తుంది.
టీ తాగిన తర్వాత చల్లని పదార్థాలు తినడం మానుకోవాలి. వేడి టీ తాగిన తర్వాత చల్లనివి తింటే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది.
టీ తాగిన వెంటనే నీళ్లు తాగితే జీర్ణ సమస్యలు వస్తాయి.
టీ తాగిన తర్వాత పెరుగు, మజ్జిగ తీసుకుంటే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది.
టీ తాగిన తర్వాత కూల్ డ్రింక్స్ తాగితే.. దగ్గు, జలుబు వంటివి వస్తాయి.
టీ తాగిన తర్వాత ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం మంచిది కాదు.