కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో రియాన్ పరాగ్ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ 2025లో 53వ మ్యాచ్లో పరాగ్ 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదాడు.
13వ ఓవర్లో మొయిన్ అలీ బౌలింగ్లో 5 బంతుల్లో 5 సిక్సర్లు, ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి వేసిన మొదటి బంతిని కూడా సిక్సర్గా మలిచాడు.
రియాన్ పరాగ్ క్రికెట్ మైదానంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా హాట్ టాపిక్ గా ఉంటాడు. తన ఆదాయం గురించి కూడా వార్తల్లో నిలుస్తుంటాడు.
పలు రిపోర్టుల ప్రకారం, 2024 నాటికి రియాన్ పరాగ్ నికర విలువ 10 నుండి 15 కోట్ల రూపాయల మధ్య ఉంది. అతని ఆదాయానికి ప్రధాన వనరు క్రికెట్.
బ్రాండ్ ప్రచారాల ద్వారా కూడా రియాన్ మంచి ఆదాయం పొందుతున్నాడు. దేశవాళీ క్రికెట్, కాంట్రాక్టుల ద్వారా కూడా జీతం వస్తుంది.
ఐపీఎల్ 2025లో రియాన్ పరాగ్ రాజస్థాన్ రాయల్స్ నుండి 14 కోట్ల రూపాయలు అందుకుంటున్నాడు. 2019లో అతన్ని కేవలం 20 లక్షలకే కొనుగోలు చేశారు.
రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటాడు. తన ఫోటోలు, అందమైన క్షణాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు.