వియత్నాం ఎయిర్లైన్ VietJet హోలీ సందర్భంగా ప్రత్యేక సేల్ తీసుకువచ్చింది. భారతీయుల కోసం తక్కువ ధరకే విమాన టికెట్లు ఇస్తోంది.
హోలీ ఫెస్టివ్ సేల్ కింద VietJet ఎయిర్లైన్ కేవలం రూ.11కే విమాన ప్రయాణించే ఛాన్స్ ఇస్తోంది. ఈ ఆఫర్ కింద వియత్నాం నగరాలు చూడొచ్చు.
భారతీయ ప్రయాణికుల కోసం వన్-వే ఎకానమీ క్లాస్ టికెట్ ధర కేవలం రూ.11 నుంచి అందుబాటులో ఉంది. దీనికి అదనంగా పన్నులు, ఎయిర్పోర్ట్ ఫీజులు కట్టాలి.
ఈ ఆఫర్ కింద 10 మార్చి 2025 నుంచి 30 సెప్టెంబర్ 2025 మధ్యలో ప్రయాణం చేయొచ్చు. ఈ ఆఫర్ ఇండియా నుంచి వియత్నాం వెళ్లే రూట్స్లో ఉంటుంది. ఇది 28 ఫిబ్రవరి 2025 వరకు ఉంటుంది.
భారత్లో న్యూఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, కొచ్చి, హైదరాబాద్, బెంగళూరు నుంచి వియత్నాంలోని హనోయి, హో చి మిన్ సిటీ, డా నాంగ్లకు ఫ్లైట్స్ ఉన్నాయి.
హోలీ ఫెస్టివ్ ఆఫర్ కోసం VietJet Air అధికారిక వెబ్సైట్ www.vietjetair.com తో పాటు VietJet ఎయిర్ మొబైల్ యాప్లో కూడా బుక్ చేసుకోవచ్చు.
మార్చి 2025లో VietJet బెంగళూరు, హైదరాబాద్ నుంచి హో చి మిన్ సిటీకి రెండు కొత్త విమానాలు స్టార్ట్ చేయనుంది. ఆ తర్వాత ఇండియా-వియత్నాం మధ్య వారానికి 78 ఫ్లైట్స్ ఉంటాయి.