2003-2022 మధ్య 21% కంటే ఎక్కువ సముద్ర భాగం చీకటిగా మారిందని ఇటీవల పరిశోధనల్లో బయటపడింది.
సముద్ర జలాల్లో సూర్య కాంతి ఒక్కోచోట ఒక్కోలా ప్రసరిస్తుంది. ఇలాంటి సూర్యకాంతి పొరలనే ఫోటిక్ జోన్లు అంటారు.
సముద్రాల లోతును బట్టి ఫోటిక్ జోన్లు ఏర్పడతాయి. రకరకాల సముద్ర జీవులు వివిధ ఫోటిక్ జోన్లలో జీవిస్తాయి.
సూర్యకాంతి సక్రమంగా ప్రసరించక ఫోటిక్ జోన్ లో జీవులు ఆక్సజన్ అందక అవస్థలు పడుతున్నాయి.
నాసా ఉపగ్రహ డేటా, కస్టమ్ అల్గారిథమ్లను ఉపయోగించి నాసా పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా 9 కి.మీ సముద్ర పిక్సెల్లలో ఫోటిక్ జోన్ లోతులను విశ్లేషించారు.
ప్రపంచ వ్యాప్తంగా సముద్రాల్లో కలుస్తున్న వ్యర్థ జలాలు, వాతావరణ మార్పుల వల్లే ఫోటిక్ జోన్ లో చీకటి పెరుగుతోందని నానా శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
వ్యర్థ జలాలు, వాతావరణ మార్పుల కారణంగా గల్ఫ్ స్ట్రీమ్, ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో అత్యంత ఫోటిక్ జోన్లు మార్పులను చవిచూశాయి.
సముద్రం లోతుల్లోకి సూర్య కాంతి చేరకపోవడంతో సముద్ర జీవులు నీటి ఉపరితలం వైపునకు వచ్చేస్తున్నాయి. దీంతో ప్రాణాలు కోల్పోతున్నాయి.
ఫోటిక్ జోన్లు ఆక్సిజన్, ఫుడ్ ఛైన్, వాతావరణ నియంత్రణకు సహకరిస్తాయి. ఇది దెబ్బతింటే మనిషి జీవితంపై కూడా ప్రభావం పడుతుంది.