కొన్ని రకాల ఫ్రూట్స్ తిన్న తర్వాత నీళ్లు తాగితే ఆరోగ్యం దెబ్బతింటుంది. అవేంటి? ఎందుకు నీళ్లు తాగకూడదో ఇప్పుడు చూద్దాం.
కొన్ని పండ్లలో ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి ఆహారం సహజంగా జీర్ణం కావడానికి సహాయపడతాయి. అలాంటి పండ్లు తిన్నాక నీళ్లు తాగితే అరుగుదల కష్టమవుతుంది.
కొన్ని పండ్లలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. అలాంటి పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి.
అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగితే దగ్గు, జలుబు, జ్వరం వస్తాయి. షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి.
పుచ్చకాయ, దోసకాయ తిన్న వెంటనే నీళ్లు తాగకండి. వాటిలో నీళ్లు ఎక్కువ. నీళ్లు తాగితే జీర్ణ సమస్యలు, గ్యాస్ వస్తాయి.
జామకాయలో విటమిన్ సి ఉంటుంది. తిన్న వెంటనే నీళ్లు తాగితే అజీర్తి చేస్తుంది.
సిట్రస్ పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగితే వాటిలోని ఆమ్లం, కడుపులో సహజంగా ఉత్పత్తి అయ్యే ఆమ్లంతో కలిసి ఎసిడిటీని కలిగిస్తుంది.
బెర్రీలు, మామిడి, ఆపిల్, సీతాఫలం లాంటి పండ్లు తిన్నాక కూడా వెంటనే నీళ్లు తాగకండి. తాగితే జలుబు, దగ్గు, అజీర్తి వస్తాయి.