కొన్ని పండ్లు తిన్న తర్వాత నీరు తాగితే శరీరంపై చెడు ప్రభావం పడుతుంది. అవేంటో ఏ పండ్లో ఇక్కడ చూడవచ్చు.
కొన్ని పండ్లలో జీర్ణ ఎంజైమ్లు ఉండటం వల్ల అవి సహజంగానే ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడతాయి. అలాంటి పండ్లు తిన్న తర్వాత నీరు తాగితే ఆహారం జీర్ణం కావడం కష్టం.
కొన్ని పండ్లలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి పండ్లు తిన్న వెంటనే నీరు తాగితే శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి.
అరటిపండు తిన్న వెంటనే నీరు తాగితే దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు వస్తాయి. రక్తంలో చక్కెర కూడా పెరుగుతుంది.
పుచ్చకాయ, దోసకాయ తిన్న వెంటనే నీరు తాగకూడదు. ఎందుకంటే వాటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల నీరు తాగితే జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం వస్తుంది.
జామకాయలో విటమిన్ సి ఉండటం వల్ల దాన్ని తిన్న వెంటనే నీరు తాగితే అజీర్తి వస్తుంది.
సిట్రస్ పండ్లు తిన్న వెంటనే నీరు తాగితే ఆ పండ్లలోని ఆమ్లం కడుపులో సహజంగా ఉత్పత్తి అయ్యే ఆమ్లంతో కలిసి ఆమ్లతను కలిగిస్తుంది.
బెర్రీలు, మామిడి పండు, ఆపిల్, సీతాఫలం వంటి పండ్లు తిన్న తర్వాత కూడా వెంటనే నీరు తాగకూడదు. తాగితే జలుబు, దగ్గు, అజీర్తి వస్తుంది.