భర్త మోసం: పిల్లలతో పాటు రోడ్డున పడ్డ మహిళ, వారం రోజులుగా అక్కడే..

By telugu teamFirst Published Dec 12, 2020, 6:03 PM IST
Highlights

భర్త మోసం చేయడంతో ఓ మహిళ పిల్లలతో పాటు రోడ్డున పడింది. ఈ సంఘటన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో జరిగింది. తనకు న్యాయం చేయాలని ఆమె రోడ్డు మీదే జీవిస్తూ కోరుతోంది.

విజయవాడ: భర్త చేతిలో మోసపోయిన ఓ మహిళ పిల్లలతో పాటు రోడడున పడింది. కృష్ణా జిల్లా విజయవాడ కొత్త రాజరాజేశ్వరిపేటలో భర్త చేతిలో మహిళ మోసపోయింది. గత వార రోజులుగా ఆమె పిల్లలతో పాటు విజయవాడ కొత్త రాజరాజేశ్వరిపేటలోని మసీదు ముందు బైఠాయించి నిరసన తెలుపుతోంది.

తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని ఆమె పోరాటం చేస్తోంది. పోలీసులను ఆశ్రయించినప్పటికీ న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన న్యాయం జరిగేలా చూడాలని ఆమె మీడియా ప్రతినిధులను కోరింది. 

click me!