మైనర్ బాలుర దొంగల ముఠా... విజయవాడలో వరుస చోరీలు

By Arun Kumar PFirst Published Oct 15, 2019, 2:29 PM IST
Highlights

విజయవాడలో మైనర్ బాలురతో కూడిన దొంగల ముఠా హల్ చల్ చేస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారి ఆట కట్టించారు. 

విజయవాడ: నగరంలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ దోపిడీ ముఠా పోలీసులకు చిక్కింది.  అరెస్టయిన నిందితుల నుంచి 426 గ్రాముల బంగారు ఆభరణాలు,18లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు  డిసిపి హర్ష వర్ధన్ రాజు  వెల్లడించారు. 

విజయవాడలో ఇటీవల కాలంలో పగటి పూట ఎక్కువగా చోరీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానాస్పద ముఠాలపై ప్రత్యేక నిఘా వుంచిన పోలీసులు చివరకు దోపిడీకి పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు. 

నగరంలో పలు ప్రాంతాల్లో ఈ ముఠా  ముందుగా రెక్కీ నిర్వహించి  తాళంవేసి వున్న ఇళ్లను చోరీలకు ఎంచుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. నగర సీపీ ద్వారక తిరుమల రావు ఆదేశాల మేరకు నిఘాని ముమ్మరం చేయడంతో చోరీలకు పాల్పడుతున్న 5 గురు బాలనేరస్థులను అరెస్ట్ చేసామని డిసిపి  తెలిపారు. 

నగరంలో జేబు దొంగతనాలకు పాల్పడుతున్న మరో నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు డిసిపి వెల్లడించారు. ఈ నేరస్థులపై గతంలో 8 కేసులు ఉన్నాయని తెలిపారు. ఆర్ధిక సమస్యలు, దురలవాట్ల కోసమే వీరు నేరాల బాట పట్టినట్లు విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. 

click me!