video:రాష్ట్రంలో మతకల్లోలాలకు కుట్రలు... అందుకోసమే టీటీడిపై దుష్ఫ్రచారం: వైవి సుబ్బారెడ్డి

Dec 1, 2019, 9:04 PM IST

తిరుమల తిరుపతి బోర్డుపై కావాలనే కొందరు పనిగట్టుకుని కుట్రలు చేస్తున్నారని... అందులో భాగంగా అన్యమత ప్రచారం జరుగుతుననట్లు అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఏబీఎన్ రాధాకృష్ణతో కలిసి ఈ కుట్ర చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో మతకల్లోలాలు సృష్టించాలని చూస్తున్నారని... రాజకీయ అవసరాల కోసం తిరుమలను వాడుకుంటున్నారని ఆరోపించారు.  ఇలాంటి కుట్రలు చేసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.