మహాశివరాత్రి : వేములవాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన ఈటెల రాజేందర్

Feb 21, 2020, 3:07 PM IST

మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్నను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్  దర్శించుకున్నారు. పట్టువస్త్రాలు సమర్పించారు. వేములవాడలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ఈటెల రాజేందర్ కు సాదర స్వాగతం పలికారు.  మర్యాద శివరాత్రి వేడుకల్లో భాగంగా హుజురాబాద్, జమ్మికుంట, ఇళ్లందకుంట, సిరిసేడు, కనగర్తి, కమలాపూర్ మండలం గూనిపర్తి గ్రామాల్లోని శివాలయాలను ఈటెల రాజేందర్ దర్శిస్తారు.