తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది : కరీంనగర్ కలెక్టర్ కర్ణ

May 3, 2023, 5:25 PM IST

తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు ఎవరు అధర్య పడద్దని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణ సూచించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ సెంటర్ ను ఆయన సందర్శించారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించి , స్థానిక రైతులతో మాట్లాడారు. సాధారణ రేటునే తడిసిన ధాన్యానికి ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. కోత పేరుతో రైతులను మిల్లర్లు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.