కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ: : కోల్‌కతా ను మట్టికరిపించిన కోహ్లీ సేన

Oct 13, 2020, 12:17 AM IST

IPL 2020 వరుసగా రెండు మ్యాచుల్లో స్వల్ప లక్ష్యాలను కాపాడుకుని, రెండు ఘనవిజయాలు అందుకున్న కేకేఆర్, భారీ లక్ష్యచేధనలో చిత్తుగా ఓడింది. 195 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలో దిగిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... వరుస వికెట్లు కోల్పోయి చిత్తుగా ఓడింది. సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న టామ్ బంటన్ అవుట్ అవ్వడంతో మొదలైన వికెట్ల పతనం... ఆండ్రే రస్సెల్ వికెట్ దాకా కొనసాగింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 112 పరుగులకే పరిమితమైన కేకేఆర్, 82 పరుగుల తేడాతో ఆర్‌సీబీకి ఘనవిజయాన్ని అప్పజెప్పింది...