Oct 17, 2020, 9:52 PM IST
IPL 2020లో నాలుగో విజయాన్ని అందుకుని, ప్లేఆఫ్ రేసులో ఉన్నామని ఘనంగా చాటాలనుకున్న రాజస్థాన్ రాయల్స్కు షాక్ ఇచ్చాడు ఏబీ డివిల్లియర్స్, ‘మిస్టర్ 360’ స్పెషల్ ఇన్నింగ్స్ కారణంగా మరో రెండు బంతులు ఉండగానే 178 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని అందుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... చివరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో విజయంతో 12 పాయింట్లతో ప్లేఆఫ్ బెర్త్కి మరింత దగ్గరైంది ఆర్సీబీ.