video: గృహనిర్మాణంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్ష

Oct 17, 2019, 8:47 PM IST

పట్టణ ప్రాంతాల్లో అవకాశం ఉన్నచోట పేదలకు అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్లు కన్నా ఇళ్లస్థలాలు కేటాయించి, ఇళ్లు కట్టించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం పేదలు ఉంటున్న ఫ్లాట్లలో నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల అపరిశుభ్రపరిస్థితులు తలెత్తుతున్నాయని, ప్లాట్లు దెబ్బతింటున్నాయన్నారు. ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మంత్రులు బొత్స, బుగ్గన, రంగనాథరాజు హాజరయ్యారు.