వల్లభనేని వంశీ, కొడాలి నానిని అందుకే టార్గెట్‌ చేశారు: YS Jagan Slams Chandrababu | Asianet Telugu

Published : Feb 18, 2025, 04:00 PM IST

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో పర్యటించారు. విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించారు. జగన్ వెంట వైసీపీ నాయకులు కొడాలి నాని, తలశిల రఘురాం తదితరులు ఉన్నారు. వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకొని జై జగన్, సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ములాఖత్ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సొంత సామాజికవర్గంలో ఎవరైనా ఎదిగితే ఓర్చుకోలేరని... అందుకే వల్లభనేని వంశీ, కొడాలి నాని లాంటి వాళ్లను చంద్రబాబు, లోకేశ్ టార్గెట్ చేశారని విమర్శించారు.