యువతకు ఐటీ, ప్రొఫెషనల్ కోర్సులు వైఎస్ చలవే: సాకే శైలజానాథ్ | Asianet News Telugu

Published : Mar 11, 2025, 02:00 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో యవతను, విద్యార్ధులను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిపించేందుకే ఈ నెల 12వ తేదీన వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 'యువత పోరు' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి సాకె శైలజానాథ్ తెలిపారు. అనంతపురం వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్య, వైద్యరంగాలను పూర్తిగా నిర్వీర్యం చేసే లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు కల్పన లేదు, నిరుద్యోగభృతి అమలు అంతకంటే లేదు, చివరికి విద్యార్ధులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంకు కూడా తూట్లు పొడిచే దుర్మార్గ పాలనను చూస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం వ్యాపార ధోరణితోనే పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఐటీ, వృత్తి నిపుణులుగా యువత ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం చలవేనని చెప్పారు.

26:56No Petrol Shortage in AP:రాష్ట్రంలో పెట్రోల్ కొరత లేదు విజయవాడ జాయింట్ కలెక్టర్| Asianet News Telugu
12:20సచిన్ పవర్ ఫుల్ స్పీచ్ కి దద్దరిల్లిన ఆంధ్ర యూనివర్సిటీ | Andhra University Centenary Celebrations
11:30ఆంధ్ర యూనివర్సిటీ ఉత్సవాల్లో వెంకయ్య నాయుడు పవర్ ఫుల్ స్పీచ్ | Andhra University Celebrations
15:09Nara Lokesh Speech: ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | Andhra University
08:07Trivikram Srinivas: త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పీచ్ కి దద్దరిల్లిన ఆంధ్ర యూనివర్సిటీ| Asianet Telugu
20:00ఆంధ్ర యూనివర్సిటీలో సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | Andhra University Centenary Celebrations
07:28No Petrol Shortage: తిరుపతి జిల్లాలో పెట్రోల్ కొరత లేదు జాయింట్ కలెక్టర్ ప్రెస్ మీట్| Asianet Telugu
05:51Petrol Shortage: నెల్లూరు జిల్లాలో పెట్రోల్ కష్టాలు జిల్లా కలెక్టర్ కీలక ప్రెస్ మీట్| Asianet Telugu
05:24Fuel Issue:1000రూ. ఇంధనంతో Hyderabad ఎలా వెళ్ళాలి.. వాహనదారుల కష్టాలు చూడండి | Asianet News Telugu
13:10Fuel Issue: వీళ్ళ ముగ్గురికీ స్పృహలేదు.. పెట్రోల్ కొరతపై Perni Nani Comments | Asianet News Telugu