వైసిపి లీడర్ కొడుకు చేతిలో మోసపోయా... అందుకే ఎన్నికల్లో పోటీ: యువతి ఆవేదన

Mar 9, 2021, 4:31 PM IST

అమలాపురం: వైసిపి నేత సుపుత్రుడు చేతిలో మోసపోయిన ఓ యువతి మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తోంది. తనకు జరిగిన అన్యాయం ముఖ్యమంత్రి జగన్ వరకు వెళ్ళాలనే తాను అమలాపురం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు బాధితురాలు ఎంబిఎ విద్యార్థిని బైరిశెట్టి రేణుక వెల్లడించింది. తనను ప్రేమ పేరుతో అమలాపురం వైసిపి కార్యదర్శి చలమని శ్రీనివాసరావు కుమారుడు ధనుష్ క్రిష్ణ మోసం చేశాడని చేయువతి ఆరోపిస్తోంది. నిందితుడికి బిసి సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల క్రిష్ణ అండగా నిలిచారని బాధితురాలు ఆరోపించారు.