Jan 27, 2020, 1:18 PM IST
రాజధానిలో రైతుల ఆందోళనలు 41 వ రోజుకు చేరుకున్నాయి. తుళ్ళూరు, మందడం గ్రామాల్లో మహాధర్నా కొనసాగుతుంది. వెలగపూడిలో రిలే నిరాహారదీక్షలు 41 వరోజు కొనసాగుతున్నాయి. ఇక తుళ్ళూరు మహాధర్నాలో విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ పాల్గొన్నారు. రాజధాని రైతులకు సంఘీభావం తెలిపారు.