అదుపు తప్పి బోల్తా: బస్సు కింద ఇరుక్కున్న డ్రైవర్ (వీడియో)

May 6, 2019, 10:17 AM IST

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రమణ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డు ప్రక్కన బోల్తా కొట్టింది. దాంతో 30 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 10 మంది చిన్నారులున్నారు. డ్రైవర్ బస్సు క్రింద ఇరుక్కున్నాడు.  క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.