దొంగ తెలివి.. షాపు మూయకముందే చొరబడి.. అందరూ వెళ్లాక చోరీ..

Jan 26, 2023, 2:15 PM IST

పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా, సత్తెనపల్లిలో ఉన్న విజేత బార్ అండ్ రెస్టారెంట్ లో చోరీ జరిగింది. దొంగ తెలివిగా బార్ మూయకముందే షాపులోకి ప్రవేశించి.. దాక్కున్నాడు. షాపు మూసి అందరూ వెళ్లిపోయిన తరువాత దొంగతనానికి పాల్పడ్డాడు. బార్ అండ్ రెస్టారెంట్ లో ఉన్న రూ.1.10 (లక్ష పదివేలు) నగదును అపహరించాడు. ఇదంతా అక్కడున్న సిసి కెమెరాలో రికార్డ్ అయింది. దీంతో ఈ ఫుటేజీ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.