అన్నీ రాసుకుంటున్నాం.. వడ్డీతో సహా చెల్లిస్తాం.. నారాలోకేష్

Jun 15, 2020, 11:40 AM IST

టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ అనంతపురం చేరుకున్నారు.  జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. తప్పుడు కేసులు పెడుతున్నారని, కావాలని అరెస్టులు చేస్తున్నారని జగన్ ప్రబుత్వాన్ని దుయ్యబట్టారు. అన్నీ రాసుకుంటున్నాం, వడ్డీతో సహా చెల్లిస్తాం అన్నారు. తొందరలోనే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు. వాహనాల కొనుగోలు ఆరోపణలపై అరెస్టయిన తమ పార్టీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి నారా లోకేష్ అనంతపురం వచ్చిన సంగతి తెలిసిందే.