ప్రొక్లెయిన్‌తో వృద్దుడి మృతదేహం తరలింపు: జగన్‌పై లోకేశ్ విమర్శలు (వీడియో)

ప్రొక్లెయిన్‌తో వృద్దుడి మృతదేహం తరలింపు: జగన్‌పై లోకేశ్ విమర్శలు (వీడియో)

Siva Kodati |  
Published : Jun 26, 2020, 10:03 PM IST

 శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘటన దారుణమని, అసలు ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా అని లోకేశ్ ప్రశ్నించారు

కరోనా విషయంగా వైఎస్ జగన్ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. పారాసిటమాల్ వేసుకుంటే కోవిడ్ 19 తగ్గిపోతుందని జగన్ రెడ్డి చెప్పిన రోజే వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి అర్థం అయ్యిందని ఆయన వ్యాఖ్యానించారు.

శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘటన దారుణమని, అసలు ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా అని లోకేశ్ ప్రశ్నించారు. పలాసలో 70 ఏళ్ల వృద్ధుడు చనిపోతే కరోనా లక్షణాలు ఉన్నాయని చెప్పి మృతదేహాన్ని ప్రొక్లెయిన్‌‌తో ఈడ్చుకుంటూ వెళ్తారా అని ఆయన నిలదీశారు.

ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వదలాలన్న లోకేశ్.. జగన్ మాటలకు, క్షేత్ర స్థాయిలో జరుగుతున్న దానికి సంబంధమే లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వమే ఇలా వ్యవహరిస్తే ఇక ప్రజల్లో ఎలాంటి ఆందోళన ఉంటుందో సీఎం అర్థం చేసుకోవాలని లోకేశ్ సూచించారు. 
 

05:35Chintha Vijay Prathap Reddy: జగ్గయ్యపేట అంగన్వాడీ కేంద్రాలపై ఫుడ్ కమిషన్ తనిఖీ| Asianet News Telugu
18:18Kandula Durgesh: అసెంబ్లీ లో కందుల దుర్గేష్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
07:37పోలీసులపై రాజకీయ కక్షలా? వైసీపీకి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన హోంమంత్రి అనిత | Asianet News Telugu
05:49Nara Lokesh Powerful Speech in Assembly: అసెంబ్లీ లో నారా లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet Telugu
03:18Janhvi Kapoor Visits Tirumala | Walks Alipiri Footpath: శ్రీవారి సేవలో జాన్వీ కపూర్ | Asianet Telugu
54:43CM Chandrababu Powerful Speech: అసెంబ్లీ లో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
26:14Dputy CM Pawankalyan Speech in Assembly: పవన్ స్పీచ్ కి దద్దరిల్లిన అసెంబ్లీ | Asianet News Telugu
12:05Kalvakuntla Kavitha in Tirumala: కొత్త పార్టీ పడతా: కవిత | Asianet News Telugu
19:56ఎక్కువ మంది పిల్లల్ని కనేవారికి బంపరాఫర్ | CM Chandrababu on AP Population | Asianet News Telugu
04:24ప్రొద్దుటూరు లో YS Jagan కు ఘన స్వాగతం | Blessings for Newlywed Couple | YSRCP | Asianet News Telugu