ఈఎస్ఐ స్కామ్: మోడీపైకి నెట్టేసిన అచ్చెన్నాయుడు

Feb 21, 2020, 3:27 PM IST

ఈఎస్ఐ కుంభకోణంలో తన పాత్ర ఉందని ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ విషయమై విచారణ 
చేసుకోవచ్చని ఆయన సవాల్ విసిరారు. ప్రధాని నరేంద్ర మోడీ  ఆదేశాల మేరకు ఆనాడు తాను వ్యవహరించినట్టుగా అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మోడీ అన్ని రాష్ట్రాల కార్మిక శాఖ మంత్రులతో ఏర్పాటు చేశారని ఆ సమయంలో  టెలీ హెల్త్ సర్వీసెస్ ను నిరంతరాయంగా పనిచేయాలని సూచించారని చెప్పుకొచ్చారు.