స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ విశాఖలో అఖిలపక్షాల రాస్తారోకో

May 3, 2023, 5:58 PM IST

కేంద్రం స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపాలని, ప్లాంట్ ను పూర్తి  ఉత్పత్తి సామర్థ్యంతో నడపాలని డిమాండ్ చేస్తూ మద్దిలపాలెం డిపో వద్ద  అఖిలపక్ష కార్మిక, రాజకీయ, ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో  రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుకి అడ్డంగా బైటాయించి నిరసనలు తెలపడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాస్తారోకో చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసి అక్కడినుంచి తరలించి ట్రాఫిక్ క్లియర్ చేసారు.