సంక్రాంతి పందెంరాయుళ్లు : కోస్తా నుండి సీమకు పాకిన కోడి పందాలు

Jan 14, 2020, 9:26 AM IST

కోస్తా జిల్లాలో కత్తులు కట్టి కాలుదువ్వే కోడి పుంజులు ఇప్పుడు రాయలసీమ జిల్లాలలోనూ సమరానికి సై అంటున్నాయి. పందాల్లో పాల్గొనేందుకు అంతదూరం వెళ్లలేని పందెపురాయుళ్లు గుట్టుచప్పుడు కాకుండా కోళ్ల సమరానికి సిద్దం అవుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని పందేలను రక్తి కట్టించేందుకు పథకాలు వేస్తున్నారు. కోడిపందాలు ఆడినా, నిర్వహించినా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.