చీటింగ్, ట్యాపింగ్ లో జగన్ కింగ్ మేకర్ : పయ్యావుల కేశవ్ ఎద్దేవా

Feb 2, 2023, 4:45 PM IST

అమరావతి : చీటింగ్, ట్యాపింగ్ లలో కింగ్ మేకర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డే అని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. వైసిపి ప్రభుత్వం అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందని గతంలోనే తాము చెప్పామని... ఇప్పుడు అదే నిజమని తేలిపోయిందన్నారు. వైసిపి ఎమ్మెల్యేలే ఫోన్లు ట్యాప్ చేసి దొంగచాటుగా వింటున్నారని ఆరోపిస్తున్నారు... దీనికి ముఖ్యమంత్రి జగన్ ఏం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. మళ్లీ చెబుతున్నా జగన్ సర్కార్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నేతలపై నిఘా పెట్టింది... ప్రభుత్వ వ్యవస్థలనే కాదు ప్రైవేట్ వ్యక్తులను ఇందుకోసం నియమించుకుంది అని కేశవ్ ఆరోపించారు.