Video news : ఒకప్పుడు కన్నీరు పెట్టించిందే ఇప్పుడు కాసులు కురిపిస్తోంది..

Video news : ఒకప్పుడు కన్నీరు పెట్టించిందే ఇప్పుడు కాసులు కురిపిస్తోంది..

Siva Kodati |  
Published : Nov 23, 2019, 12:38 PM IST

తాజాగా పెరిగిన ఉల్లి ధరలతో కర్నూలు ఉల్లి మార్కెట్ కళకళలాడుతోంది. భారీ వరదలకు మహారాష్ట్రలాంటి ప్రాంతాల్లో ఉల్లి పంట దిగుబడి రాకపోవడంతో...ధరలు అమాంతంగా కొండెక్కాయి. 

తాజాగా పెరిగిన ఉల్లి ధరలతో కర్నూలు ఉల్లి మార్కెట్ కళకళలాడుతోంది. భారీ వరదలకు మహారాష్ట్రలాంటి ప్రాంతాల్లో ఉల్లి పంట దిగుబడి రాకపోవడంతో...ధరలు అమాంతంగా కొండెక్కాయి. దీంతో బహిరంగ మార్కెట్లో మొదటి రకం కేజీ ఉల్లి 90- 100 రూపాయలు పలుకుతోంది. ఉల్లిని పండించిన రైతన్నకు మాములు ఉల్లి 55-65 రూపాయల వరకు వస్తుంటే నాణ్యమైన ఉల్లికి 75 రూపాయల వస్తోంది. దీంతో రైతులు ఆనందంలో మునిగిపోయారు.